27, జూన్ 2019, గురువారం

లాస్య వీణ కచేరీ పై

చాలాకాలానికి యివాళ రవీంద్రభారతిలో నాదప్రభ సంస్థవారి దశాబ్ది ఉత్సవాలలో మన జయలక్ష్మి ...శ్యామసుందర్ అయ్యగారి గార్ల మనవరాలు ... లాస్యజోస్యుల వీణావాద్యం గంటపాటు రెప్పవాల్చకుండా...తాళంవేస్తూ .. తాదాత్మ్యంలో తలూపుకుంటూ భలేఎంజాయ్ చేశానండి!

రెప్పవాల్చకుండా సంగీతం వినడమేవిటో... చెవులు పెద్దవిచేసుకునో రిక్కించో అనాలికదా.... అనుకుంటున్నారా?
మీకు సంజాయిషీ యివ్వాల్సిందే!

పదహారేళ్ల లాస్య... అచ్చంగా పదహారణాలతెలుగింటి ముస్తాబులో ముద్దొస్తూనేవుంది.అంతేనా...చంద్రబింబంకన్నా అందమైన ముఖవర్ఛస్సు..
చారెడేసికళ్లు...చెంపలూ చాలావిశాలం.మేకప్పులేకుండా పసిమిచాయతో ఎంత సహజంగా వుందో పిల్ల లావణ్యం.
దానికితోడు అమ్మమ్మ తాతయ్యల లాగే మంచిపొడవు!

ఇవన్నీ అదనపు అసెట్లు .
అసలు మాట... లాస్య కచేరీకి ... గురువుగారు కూడాఅయిన తాతయ్య ...మైకులు దగ్గరుండి అమర్చడం...తిరిగి ఆడియన్స్ లోచేరి .. తాళంచూపిస్తూ ...లాస్యకి కనుసన్నలతోనే యిచ్చిన ప్రోత్సాహం...నాకుసంబరమనిపించింది.

నాట.. కీరవాణి.. ఆనందభైరవి... పూర్వీకల్యాణి..నీలాంబరి రాగాలలో చాలా గంభీరంగా వీణా వాదనం ప్రదర్శించింది.
మధ్యమధ్య ... పక్కవాద్యాలతోనేకాదు ... ప్రేక్షక జనంతోనూ ... దరహాసంతో ఆకట్టుకుంది.

విదేశాలలోనూ లాస్యకు ప్రదర్శనలివ్వడం కొత్తేమీకాదనీ తెలిసింది. వైణికులకుటుంబంలో మరో ముత్యమనుకోండి.పేరుచూశారా ప్రాస కలిగిఎంతబాగుందో!

ఆపుకున్న ముద్దును ..కచేరీ అవగానే వేదికఎక్కి .. కరచాలనంతోపాటూ కానిచ్చేశాను.

గురువులు వేదిక పైనా ... కిందా కూడా ఎంత బిజీ నో వేరేచెప్పాలా??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి