8, జనవరి 2011, శనివారం

వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

        ఒక సారి త్యాగరాజ స్వామి చైత్రోత్సవము చూడడానికి శ్రీరంగం వెళ్ళి,ఆ సమయం లో బంగారపు రధం  మీద ఊరేగింపుగా వస్తున్న దేముడిని చూచి ఆనంద పారవశ్యం తో "రాజు వెడలె చూతము రారే ' అను కృతి తోడి రాగం లో పాడేరట. 
    పదహారు మంది బోయీలతో ఊరేగుతున్న ఆ రధం త్యాగరాజ స్వామి  ఉన్న ఇంటి ముందుకు వచ్చింది, కుతూహలముతో త్యాగరాజ స్వామి ఆ వైభోగ రంగని దర్శించు కున్దామనుక్కున్నారు    . కానీ ఆ జన సమూహం లో దర్శించుకునే అవకాశం దొరకక, నిరుత్సాహ  పడి అక్కడే నిల్చుండి  పోయి చూస్తున్నారట. ఇంతలో ముందుకు సాగిన రధం కదల కుండా ఉంది పోయిందట, బోయీల కాళ్ళు బరువులేక్కి   ఒక్క అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి, ద్రుష్టి దోషం తగిలిందని భావించి తరుణోపాయలు వెతుకుతున్నారట.ఇంతలో దేవాలయం అర్చకులలో ఒకరు దేవప్రేరితులై త్యాగరాజ స్వామిని చూపి" ఆ మహా భక్తుని రధం వద్దకు తీసుకు రమ్మని" చెప్పినారట. అంతట త్యాగరాజ స్వామి సంభ్రమ ఆశ్చర్యాలతో దేవుని రధం వద్దకు పోయి ప్రఖ్యాత కృతి "వినరాద నా మనవి" అను కృతి ఆలపించారట.


అనుపల్లవి లో "కాంత కాంత లెల్ల కామించి పిలచితే" అనినారు, అంటే  దేవ దాసీలు నృత్యము చేసి పిలచితే పొరాదా అని రంగానాధుని  ప్రస్నించినారు. ఈ కృతి పాడుట పూర్తి చేసి దీపారాధన పూర్తి అయ్యేసరికి, ఆశ్చర్య దాయకముగా రధము కదలినదట.


తరువాత ఒక రోజు త్యాగరాజ స్వామి దేవాలయమునకు ఆహ్వానింప బడ్డారట. ఆ రోజు మూల విరాట్టు అద్భుతం గా అలంకరింప బడి ఉన్నదట .భగవంతుని జూచి భక్తి తో  ఈశ్వర ప్రేరితులై "ఓ రంగశాయి " అను కాంభోజి కృతి రచించినారట. 


 చిరంజీవి సౌభాగ్యవతి  కల్యాణి  కోరిక మేరకు ఈ కృతి ఏ సందర్భం లో త్యాగరాజ స్వామి రచించారనేది నాకు తెలిసిన విధం గా రాస్తున్నాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి